India Corona: అదుపులోనే మహమ్మారి.. కానీ పెరిగిన మృతుల సంఖ్య

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (23:14 IST)
దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. అయితే కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ముందురోజు 13 వేలకు పడిపోయిన కేసులు.. తాజాగా 14,623కి చేరాయి. మరణాల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది.

 
మంగళవారం 13,23,702 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,623 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. నిన్న 19,446 మంది కోలుకున్నారు. 197 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటి వరకూ కరోనా సోకిన వారి సంఖ్య 3.41 కోట్లకు చేరింది. అందులో 3.34 కోట్ల మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 4,52,651 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,78,098కి తగ్గింది. క్రియాశీల రేటు 0.52 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.15 శాతానికి చేరింది.

 
దేశంలో కరోనా టీకా కార్యక్రమం కీలక ఘట్టానికి చేరుకోనుంది. 100 కోట్ల డోసుల లక్ష్యం వైపు సాగుతోంది. ఇప్పటివరకు 99.12 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 41.36 లక్షల మంది టీకా వేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎర్రటి ఎండలో ఎద్దును బాధపెట్టారు, వైసిపి నాయకులపై చర్యలు తీసుకోండి: యాంకర్ రష్మి

సనోజ్ మిశ్రాపై మళ్లీ మోనాలిసా ఆరోపణలు.. పదిసార్లు లైంగికంగా వేధించాడు

Ram Charan: సతీ లీలావతి ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు

Nagababu: మేం కాపులం టైటిల్ మేము ‘కాప్‌’లం’ గా మారిందా?

Varalaxmi: పోలీస్ కంప్లైంట్ చిత్రంలో సూప‌ర్ స్టార్ కృష్ణపై స్పెష‌ల్ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే

ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది

వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు

మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?

Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?

తర్వాతి కథనం
Show comments