ప్రపంచ ప్రజలకు శుభవార్త చెప్పిన ఫైజర్...

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (21:17 IST)
ప్రపంచ ప్రజలకు ఫైజర్ కంపెనీ శుభవార్త చెప్పింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టే టీకాను ఫైజర్ కంపెనీ తయారు చేసింది. తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా వైరస్‌పై సమర్థంగా పనిచేస్తోందని ప్రకటించింది. 
 
ప్రస్తుతం ఈ కంపెనీ తయారు చేసిన టీకా క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా సాగుతున్నాయి. మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌లో అన్ని వయసుల వారిలోనూ దీని ప్రభావం స్థిరంగా ఉందని, త్వరలోనే యూఎస్ఎఫ్‌డీఏ అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేస్తామని తెలిపింది. 
 
అంతేకాకుండా, ప్రస్తుతం తాము తయారు చేసిన ఈ టీకా 95 శాతం సమర్థత ప్రదర్శించిందని అమెరికా ఫార్మా దిగ్గజం ప్రకటించింది. కరోనా ముప్పు అధికంగా ఉండే 65 ఏళ్లకు పైబడిన వారిలోనూ దీని సమర్థత 94 శాతానికి పైగా ఉందని వివరించింది. 
 
తమ వ్యాక్సిన్ 90 శాతం ఫలితాలు ఇస్తోందన్నారు. గతవారం ప్రకటించిన ఫైజర్ తాజాగా 95 శాతం సమర్థ ప్రదర్శించినట్టు పేర్కొంది. క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన తాజా విశ్లేషణను బుధవారం వెల్లడించింది. 
 
170 మంది కరోనా రోగులపై టీకాను ప్రయోగించగా తొలి డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత మంచి ఫలితాలు వచ్చినట్టు వివరించింది. కాగా, ఈ టీకాను మైనస్ 70 డిగ్రీల వద్ద మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండటంతో ఆ వసతులు లేని దేశాలు టీకా కొనుగోలుపై డోలాయమానంలో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments