Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ ప్రజలకు శుభవార్త చెప్పిన ఫైజర్...

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (21:17 IST)
ప్రపంచ ప్రజలకు ఫైజర్ కంపెనీ శుభవార్త చెప్పింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టే టీకాను ఫైజర్ కంపెనీ తయారు చేసింది. తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా వైరస్‌పై సమర్థంగా పనిచేస్తోందని ప్రకటించింది. 
 
ప్రస్తుతం ఈ కంపెనీ తయారు చేసిన టీకా క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా సాగుతున్నాయి. మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌లో అన్ని వయసుల వారిలోనూ దీని ప్రభావం స్థిరంగా ఉందని, త్వరలోనే యూఎస్ఎఫ్‌డీఏ అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేస్తామని తెలిపింది. 
 
అంతేకాకుండా, ప్రస్తుతం తాము తయారు చేసిన ఈ టీకా 95 శాతం సమర్థత ప్రదర్శించిందని అమెరికా ఫార్మా దిగ్గజం ప్రకటించింది. కరోనా ముప్పు అధికంగా ఉండే 65 ఏళ్లకు పైబడిన వారిలోనూ దీని సమర్థత 94 శాతానికి పైగా ఉందని వివరించింది. 
 
తమ వ్యాక్సిన్ 90 శాతం ఫలితాలు ఇస్తోందన్నారు. గతవారం ప్రకటించిన ఫైజర్ తాజాగా 95 శాతం సమర్థ ప్రదర్శించినట్టు పేర్కొంది. క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన తాజా విశ్లేషణను బుధవారం వెల్లడించింది. 
 
170 మంది కరోనా రోగులపై టీకాను ప్రయోగించగా తొలి డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత మంచి ఫలితాలు వచ్చినట్టు వివరించింది. కాగా, ఈ టీకాను మైనస్ 70 డిగ్రీల వద్ద మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండటంతో ఆ వసతులు లేని దేశాలు టీకా కొనుగోలుపై డోలాయమానంలో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments