Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష ప్రయోగంతో 60 వానరాలు మృతి

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (19:44 IST)
మహబూబాబాద్ జిల్లాలో శనిగపురం శివారులో విషప్రయోగం కారణంగా 60 వానరాలు మృతి చెందాయి. వీటికి అటవీ శాఖ అధికారులు సాముహిక అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం రాత్రి శనిగపురం గ్రామ శివారు గుట్టలో విషప్రయోగంతో కోతులను హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ ఘటనపై స్పందించిన బీజేపీ నాయకులు హనుమంతుని ప్రతిరూపంగా కొలిచే వానరాలను ఇలా విషప్రయోగం చేసి చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. వానరాలను హతమార్చడం హింసాత్మకమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడడం మానవత్వానికి విరుద్దమని నాయకులు తెలిపారు.
 
ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు ఇలాంటి క్రూరత్వానికి తెగబడిన వారిని త్వరలో గుర్తిస్తామని తెలిపారు. వానరాల మృతిపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments