పెళ్లిళ్లకు 50మంది చాలు.. 200మంది అవసరం లేదు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (19:38 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంటోంది. ఈ క్రమంలో వివాహ వేడుకలకు 50 మంది మాత్రమే హాజరయ్యే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో 200గా ఉన్న సంఖ్యను 50కి కుదించింది.
 
ఢిల్లీలో కరోనా పరిస్థితిపై సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. వైరస్ హాట్‌స్పాట్లుగా మారుతున్న మార్కెట్లను మూసివేయనున్నామని, పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్యను కుదించాలని భావిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు పంపగా.. బుధవారం ఆయన ఆమోద ముద్ర వేశారు.
 
అలాగే, లాక్‌డౌన్ విధిస్తారంటూ చక్కర్లు కొడుతున్న ఊహాగానాలను ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆరోగ్య శాఖమంత్రి సత్యేంద్ర జైన్‌ తోసిపుచ్చారు. దుకాణదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీ వ్యాపారాలు తెరిచే ఉంటాయని భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. కొన్ని నిబంధనలను మాత్రం పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అది లాక్‌డౌన్ ఏ మాత్రం కాదంటూ సిసోడియా హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments