దేశంలో కొత్తగా 46 వేల కేసులో.. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34 శాతం

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (10:01 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరోమారు పెరిగింది. కిందటి రోజుతో పోల్చితే ఈ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,951 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
 
తాజాగా 60,729 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ ప్రభావంతో మరో 817 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,03,62,848కు పెరిగింది. వైరస్‌ నుంచి మొత్తం 2,94,27,330 బాధితులు కోలుకున్నారు. 
 
ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 3,98,454 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 5,37,064కు చేరాయి. మరో వైపు టీకా డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు 33,28,54,527 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది. 
 
ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 96.92 శాతానికి పెరిగిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34శాతంగా ఉందని, ఇప్పటివరకు 41.01 కోట్ల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments