దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (11:52 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా ఈ వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కేవలం 795 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
అలాగే, ఈ వైరస్ నుంచి 1280 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 58 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12054 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,29,839కు చేరింది. 
 
ఇందులో 4,24,96,369 మంది కోలుకున్నారు. మహమ్మారితో 5,21,416 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.17 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raka Fans Title: అల్లు అర్జున్ .. రాకా చిత్ర యానిమేటెడ్ టైటిల్ కు స్పందన

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ .. పంజ 4Kలో థియేటర్లలోకి తిరిగి వస్తోంది

Peddi: రామ్ చరణ్ తో ఐటెంసాంగ్ లో అలరించిన శృతి హాసన్, జాన్వీ కపూర్

హాలీవుడ్ క‌ల‌ర్స్‌ రియలిస్టిక్‌, ఇండియ‌న్ క‌ల‌ర్‌ ఎమోష‌న‌ల్‌, క‌ల్చ‌ర‌ల్లీ రిచ్‌ : కిషోర్ బోయిడాపు

Sri Satya: బిగ్ బాస్'ఫేమ్ శ్రీ సత్య ఆవిష్కరించిన విహారి OTT గ్లోబల్ విజన్

తర్వాతి కథనం
Show comments