Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా వైరస్ కల్లోలం.. 24గంటల్లో 904మంది మృతి

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (12:57 IST)
భారత్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రెండవ విడతలో రోజుకో రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోసారి లక్షదాటాయి రోజువారి కేసుల సంఖ్య... కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గడచిన 24 గంటలలో 1,68,912 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... ఇదే సమయంలో 904 మంది కన్నుమూశారు. ఇక, 75,086 మంది కోలుకున్నారు.
 
దీంతో.. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,35,27,717కు చేరుకోగా... కోలుకున్నవారి సంఖ్య 1,21,56,529కు పెరిగింది.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 12,01,009గా ఉండగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 1,70,179కు పెరిగింది.
 
దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 89.86 శాతంగా ఉన్నట్టు బులెటిన్‌లో కేంద్రం పేర్కొంది. ఇక, మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.88 శాతంగా ఉండగా... మరణాల రేటు 1.26 శాతంగా ఉంది. మరోవైపు.. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన 'కరోనా' నిర్దారణ పరీక్షల సంఖ్య 11,80,136గా ఉందని.. ఇదే సమయంలో 29,33,418 మంది వ్యాక్సినేషన్‌ అందించినట్టు కేంద్రం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

Ritu Varma: మజాకా లో రోమాన్స్ పెంచిన సందీప్ కిషన్, రీతు వర్మ

ఆస్ట్రేలియాలో చిత్రీకరించిన హరర్, థ్రిలర్, లవ్ సినిమా గార్డ్

Dhanush: ప్రేమ, బ్రేకప్ నేపథ్యంలో ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంతా కోపమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments