దేశంలో నాలుగో కరోనా మృతి.. తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న కేసులు

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (17:30 IST)
దేశంలో నాలుగో కరోనా సోకిన వ్యక్తి మృతి చెందాడు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా గురువారం పంజాబ్‌లో మరో వ్యక్తి మరణించారు. దీంతో కరోనా ప్రభావంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. దేశంలో ఇప్పటికే 184 మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఒంగోలు రిమ్స్ ఐసోలేషన్ వార్డులో కరోనా సోకిన 23ఏళ్ల యువకుడికి చికిత్స అందించారు. కానీ ఆ వ్యక్తి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది అలర్టయి వెంటనే..నాలుగో ప్లోర్‌లో అతడ్ని పట్టుకున్నారు. యువకుడు కొద్దిరోజుల క్రితమే లండన్ నుంచి ఒంగోలు వచ్చాడు. వస్తూ వస్తూ కరోనాను తెచ్చాడు.
 
కరోనా సోకిందన్న మానసిక బాధతోనే అతడు పారిపోయేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.రిపోర్టులో అతడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఒంగోలు రిమ్స్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు.
 
అలాగే తెలంగాణ ప్రజలను కోవిడ్‌ వైరస్‌ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాత్రి ఒకేసారి ఏడు కరోనా కేసులు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. కొత్తగా కరోనా పాజిటివ్‌గా తేలిన బాధితులెవరూ తెలంగాణ వారు కాదు. వారంతా ఇండోనేషియాకు చెందినవారేనని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya: ఐశ్వర్యా రజినీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి నిర్మిస్తున్న టెక్స్ లా ప్రారంభం

Janhvi Kapoor: రామ్ చరణ్... పెద్ది లో గ్లామరస్‌ జాన్వీ కపూర్ పోస్టర్‌

Virosh Manyavar: ఇన్‌స్టాలో అత్యధిక లైక్స్‌తో గ్లోబల్ రికార్డ్ విరోష్ మాన్యవార్ కపుల్ యాడ్

Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది

Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments