Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో వాయిదా పడిన పోటీ పరీక్షల వివరాలు ఇవే..

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (17:12 IST)
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రాలన్నీ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించాయి. కొన్ని చోట్ల పరీక్షలు యథాతథంగా జరుగుతుంటే.. ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలు కూడా వాయిదా పడుతున్నాయి. 
 
విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ 188 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 2020 మార్చి 22న ఆన్‌లైన్ టెస్ట్ జరగాల్సి ఉంది. కానీ... కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ పరీక్షను వాయిదా వేస్తున్నామని, మళ్లీ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామో త్వరలో ప్రకటిస్తామని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నోటీస్ విడుదల చేసింది.
 
సెంట్రల్ ఎయిర్‌మెన్ సెలక్షన్ బోర్డ్-సీఏఎస్బీ ఎయిర్‌మెన్ స్టార్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌ను మార్చి 19 నుంచి 23 వరకు నిర్వహించాల్సి ఉండగా ఎగ్జామ్‌ను ఏప్రిల్ చివరి వారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
 
 మార్చి 22 ఆదివారం దేశవ్యాప్తంగా 11 నగరాల్లో జరగాల్సిన రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌ను వాయిదా వేస్తున్నట్టు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) ప్రకటించింది. అలాగే ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న మెయిన్స్ ఎగ్జామ్‌ను వాయిదా వేసింది. కొత్త తేదీలను త్వరలో ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments