ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు... అధికారుల్లో ఆందోళన

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (10:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా మరో 186 మందికి ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో కరోనా వైరస్ సోకి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
 
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్‌లోనూ ఈ కేసులో నమోదయ్యాయి. దీంతో అన్ని విమానాశ్రయాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. విదేశాల వచ్చే వారిపై కఠిన ఆంక్షలు విధించారు.
 
ఈ నేపథ్యంల ఏపీలో పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 186 మందికి వైరస్ సోకినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 32,036 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన 138 కేసులు నమోదు కాగా కొత్తగా 186 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments