Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా దూకుడు : తగ్గని పాజిటివ్ కేసులు - మరణాలు సంఖ్య

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (11:04 IST)
దేశంలో కరోనా వైరస్ దూకుడు కొనసాగుతూనేవుంది. అయితే, వారం రోజుల క్రితంతో పోల్చితే ఇపుడు కాస్త మెరుగు అనిపిస్తోంది. ఎందుకంటే.. వారం రోజుల క్రితం ప్రతి రోజూ 60 వేలకు పైగా కేసులు నమోదవుతూ వచ్చేవి. కానీ, ఇపుడు 55 వేలకు పడపోయాయి. గత 24 గంటల్లో 55,079 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 876 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 27,02,743కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 51,797కి పెరిగింది. ఇక 6,73,166 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 19,77,780 మంది కోలుకున్నారు. 
 
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,682 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదేసమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,070  మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,937 కు చేరింది. ఆసుపత్రుల్లో 21,024 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 72,202 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 711 కి  చేరింది. జీహెచ్‌ఎంసీలో 235 మందికి కొత్తగా కరోనా సోకింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments