Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 45వేలకు చేరిన కరోనా మృతుల సంఖ్య.. దేశంలోనూ..?

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (21:14 IST)
మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య 45వేలు దాటింది. వైరస్‌ వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 3,959 పాజిటివ్‌ కేసులు, 150 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,14,273కు, మరణాల సంఖ్య 45,115కు పెరిగింది.
 
మరోవైపు గత 24 గంటల్లో 6,748 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 15,69,090కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 99,151 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతుంది.
 
దేశంలో కరోనా కేసులతో పాటు, మృతుల సంఖ్య కూడా గణనీయంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 577 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో 1,25,562 మంది మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో 50,357 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 84,62,081కు చేరింది. గడిచిన 24 గంటల్లో 53,920 కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 78,19,887 కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"అర్జున్ రెడ్డి" వల్లే గుర్తింపు - క్రేజ్ వచ్చింది : షాలినీ పాండే

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments