Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కరోనా మరణాలు 51 - పాజిటివ్ కేసులు 6235

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (18:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. అటు పాజిటివ్ కేసులతో పాటు.. ఈ వైరస్ సోకి మరణించే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో మొత్తం 51 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోగా, మరో 6235 మంది ఈ వైరస్ బారినపడ్డారు. 
 
ఇందులో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,749కి పెరిగింది. మరణాల సంఖ్య 5,410కి చేరింది. తాజాగా 10,502 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 5,51,821 మంది ఈ వైరస్ మహమ్మారి నుంచి విముక్తులయ్యారు. ఇంకా 74,518 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇకపోతే, జిల్లాల వారీగా యాక్టివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 2,996, చిత్తూరు 6,906, ఈస్ట్ గోదావరి 12,134, గుంటూరు 6,418, కడప 3,569, కృష్ణ 2,849, కర్నూలు 2,868, నెల్లూరు 2,757, ప్రకాశం 10,935. శ్రీకాకుళం 5,205, విశాఖపట్టణం 4,206, విజయనగరం 6,876, వెస్ట్ గోదావరి 6,899 చొప్పున మొత్తం 7,4518 కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments