దేశంలో మరింతగా తగ్గిన కరోనా కేసులు - కలవరపెడుతున్న ఎక్స్ఈ

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (12:28 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బాగా తగ్గిపోయాయి. అదేసమయంలో ఎక్స్ఈ కరోనా వేరియంట్ ఇపుడు కలవరపాటుకు గురిచేస్తుంది. ముంబైలో తొలి ఎక్స్ఈ వేరియంట్ కేసు నమోదైంది. 
 
ఇదిలావుంటే, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1033 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే మరింతగా తగ్గాయి. మరోవైపు, కరోనా బాధితుల్లో 1,222 మంది కోలుకోగా, 43 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 11,639 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4.3 కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో 4,24,98,789 మంది కోలుకున్నారు. మొత్తం 5,21,530 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. మరోవైపు, కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ఈ కలవరపెడుతుంది. ఈ తొలి కేసు ముుంబైలో నమోదైనట్టు వార్తలు వస్తుంటే, కేంద్ర మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments