Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెట్రో బాదుడు .. 16 రోజుల్లో 14 సార్లు పెరిగిన ఇంధన ధరలు

petrol
, బుధవారం, 6 ఏప్రియల్ 2022 (11:18 IST)
దేశంలో ఇంధనం ధరలు పెరిగిపోతున్నాయి. గడిచిన 16 రోజుల్లో 14 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు మరో 80 పైసల భారాన్ని చమురు సంస్థలు విధించాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 105.41గా ఉండగా.. డీజిల్ ధర రూ. 96.67 వద్దకు చేరుకుంది.  తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. 
 
హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 119.49కు చేరగా.. డీజిల్ ధర రూ. 105.49గా ఉంది. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో లీటర్ పెట్రోల్, డీజిల్ పై వరుసగా 87, 83 పైసలు మేర పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ. 121.26గా ఉండగా.. డీజిల్ ధర రూ. 106.87 వద్దకు చేరుకుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంకలో ఎమర్జెన్సీ రద్దు - మరింతగా దిగజారిన పరిస్థితులు