కుమారుడు కరోనా అంటించాడు, తండ్రి మరణించాడు

Webdunia
బుధవారం, 20 మే 2020 (21:36 IST)
కరోనా సోకిన వ్యక్తుల కన్నా కాంటాక్ట్ పద్థతిన సోకే వారికే  ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. పది సంవత్సరాలలోపు వారు 60 సంవత్సరాలకు పైబడిన వారు బయట తిరగవద్దని.. జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే వారు జాగ్రత్తగా ఉన్నా వారి కుటుంబ సభ్యుల ద్వారా కరోనా సోకడంతో ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
చిత్తూరు జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. శ్రీకాళహస్తికి చెందిన 60 యేళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ నెల 13వ తేదీన స్విమ్స్ ఆసుపత్రిలో కరోనాతో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి కుమారుడి ద్వారా వైరస్ వ్యాపించినట్లు వైద్యులు నిర్థారించారు. 
 
గత రెండు నెలల క్రితం మృతి చెందిన వ్యక్తి కుమారుడు విదేశాల నుంచి వచ్చాడు. కరోనాతో వచ్చిన కుమారుడి ద్వారా ఆ వైరస్ సోకింది. అంతకు ముందే షుగర్, బిపితో పాటు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న 60 యేళ్ల వ్యక్తిని  బతికించేందుకు శాయశక్తులా వైద్యులు ప్రయత్నించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని తిరుపతి కరంకంబాడి రోడ్డులోని గోవిందధామం స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments