Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కన్నతల్లిపై నీచానికి ఒడిగట్టిన కుమారుడు.. నగ్న ఫోటోలను వాట్సాప్ గ్రూపులో పెట్టి?

కన్నతల్లిపై నీచానికి ఒడిగట్టిన కుమారుడు.. నగ్న ఫోటోలను వాట్సాప్ గ్రూపులో పెట్టి?
, మంగళవారం, 19 మే 2020 (16:46 IST)
ఆధునిక పోకడల కారణంగా మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. కన్నతల్లిపై ఓ ప్రబుద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆస్తి కోసం కన్నతల్లి  నగ్న చిత్రాలను వాట్సాప్ గ్రూపులో పంచి నీచానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన ఓ 75ఏళ్ల వద్ధురాలి భర్త 22 రోజుల క్రితమే మరణించాడు. 
 
అప్పటినుంచి ఆస్తి తన పేరున రాయాలంటూ ఆమె 50 ఏళ్ల కుమారుడు తల్లిని పీక్కుతినడం మొదలెట్టాడు. ఈ క్రమంలో మే 13న పనిలో నిమగ్నమైన తల్లిపై ఏదో ద్రవ పదార్థం చల్లాడు. దీంతో ఆమె చర్మంపై దురద మొదలవగా, వెంటనే స్నానానికి వెళ్లి బట్టలు మార్చుకుంది. దీన్నంతటినీ ఆమె కుమారుడు దొంగచాటుగా ఫొటోలు తీశాడు. 
 
అనంతరం ఆమె నగ్న ఫొటోలను వాట్సాప్‌లో బంధువులకు పంపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఆస్తి పత్రాలపై సంతకం పెట్టాలంటూ వేధించాడు. కొడుకు చేసిన నీచపనికి ఆక్రోశం చెందిన తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్క్ ఫ్రమ్ హోం : ఉద్యోగుల మానసికస్థితిపై ప్రభావం : సత్య నాదెళ్ల