కర్నూలు - కృష్ణా జిల్లాల్లో కరోనా మరణ మృదంగం

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (13:42 IST)
గంటల్లో ఏకంగా 12 మంది మృత్యువాతపడ్డారు. కర్నూలు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 169కి పెరిగింది. 
 
ఇక, కొత్తగా 813 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వారిలో 50 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాగా, మరో 8 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. మొత్తంగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య 13,098కి పెరిగింది. 
 
తాజాగా 401 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,908 కాగా, మరో 7,021 మంది చికిత్స పొందుతున్నారు. 
 
జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే, అనంతపురంలో 1371, చిత్తూరులో 891, ఈస్ట్ గోదావరిలో 1002, గుంటూరులో 1193, కడపలో 794, కృష్ణలో 1331, కర్నూలులో 1787, నెల్లూరులో 579, ప్రకాశంలో 313, శ్రీకాకుళంలో 62, విశాఖపట్టణంలో 145, వెస్ట్ గోదావరిలో 875 చొప్పున మొత్తం 10848 కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments