Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం జగన్.. ఏంటది?

రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం జగన్.. ఏంటది?
, శుక్రవారం, 26 జూన్ 2020 (12:26 IST)
రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. టీడీపీ సర్కార్‌ 2018 రబీ పంటల బీమా మొత్తాన్ని రైతులకు చెల్లించకుండా ఎగనామం పెట్టిన విషయాన్ని తెలుసుకున్న సీఎం .. వెంటనే కంపెనీలకు బీమా ప్రీమియంను చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. తద్వారా 2018 రబీ పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించనన్నట్లు ప్రకటించారు.
 
శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి రాష్ట్రంలో 13 జిల్లాల్లోని 5,94,005 మంది రైతుల ఖాతాలకు రూ.596.36 కోట్లు నేరుగా డబ్బులు జమ చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2018 రబీ పంటల బీమా కింద ప్రభుత్వం బీమా కంపెనీలకు ప్రీమియంను చెల్లించలేదు. దీంతో రైతులకు చెల్లించాల్సిన రూ. 596.36 కోట్లు బీమా కంపెనీలు నిలిపివేశాయి. అప్పటి నుంచి రైతులకు బీమా డబ్బులు అందలేదనే విషయం తెలిసిందే.
  
ఈ నేపథ్యంలో తమది రైతు ప్రభుత్వమని, మోసం చేసే ప్రభుత్వం కాదని, రైతులకు ఎగమామం పెట్టిన పంటల బీమా మొత్తాన్ని రైతులకు చెల్లించాలని నిర్ణయించినట్లు జగన్‌ తెలిపారు. ఈ నిర్ణయంతో 5.94 లక్షల మంది రైతులకు మేలు చేకూరనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాబోయే రోజుల్లో విపరీతంగా కరోనా మరణాలు.. డబ్ల్యూ హెచ్ ఓ