Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ పరిస్థితులపై ఏపీ హైకోర్టులో విచారణ.. మెడిసిన్ బ్లాక్ మార్కెట్‌పై..?

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (19:32 IST)
కోవిడ్ పరిస్థితులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ సర్కారుకు ప్రశ్నాస్త్రాలు సంధించింది. బ్లాక్ ఫంగస్ మెడిసిన్ బ్లాక్ మార్కెట్‌పై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
 
కొవిడ్ పరిస్థితులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బ్లాక్ ఫంగస్ మెడిసిన్ బ్లాక్ మార్కెట్ పై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం సమాధానం చెప్పింది. బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కొరత, అత్యధిక ధరలకు అమ్మకాలపై ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.
 
కేంద్ర ప్రభుత్వం సరిపడా ఇంజక్షన్లు సరఫరా చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇప్పటివరకు 13 వేల ఇంజక్షన్లు ఇచ్చారని ప్రస్తుతం 14 వందల మంది పేషేంట్స్ ఉన్నారన్న ప్రభుత్వం తరపున న్యాయవాదులు వెల్లడించారు. ఒక్కో బ్లాక్ ఫంగస్ పేషేంట్ కి రోజుకి 3 ఇంజక్షన్లను 15 రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బ్లాక్ ఫంగస్ పేషేంట్స్ కోసం 50 వేల ఇంజక్షన్ల అవసరం ఉందని వెల్లడించింది.
 
ప్రైవేట్ ఫార్మా కంపెనీల నుంచి కూడా ప్రభుత్వం కొనుగోలుకి సిద్ధమైందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఏపీకి అవసరాలకు సరిపడా బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారో, ఏ ప్రాతిపదికన రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారో మధ్యాహ్నం నాటికి చెప్పాలని హైకోర్టు సూచించింది.

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments