Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 రూపాయల డాక్టర్: కరోనావైరస్ హాంఫట్, హైదరాబాదులో ఎక్కడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (09:19 IST)
కరోనా ఇప్పుడు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులకు కాసులను కురిపిస్తోంది. వైరస్ బారిన పడి ఒక్కసారి ఆసుపత్రి మెట్లెక్కితే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోవాల్సిందేననే టాక్ విపరీతంగా వినిపిస్తోంది. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం ఒక డాక్టర్ కేవలం 10 రూపాయల ఫీజుతో కరోనాకు వైద్యం చేస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన కరోనా రోగులకు మొదటి నుంచి చివరి వరకు అయ్యే ఫీజు 15 వేల నుంచి 20 వేల లోపే. మరి ఈ పేదల డాక్టర్ ఇంత చీప్‌గా కరోనా రోగులకు ఎలా సేవ చేయగలుతున్నారో తెలుసా..?
 
హైదరాబాద్ నగరంలోని బోడుపల్ పరిసరాల్లో డాక్టర్ ఇమానుయేల్ ప్రజ్వ ఆసుపత్రిని నడుపుతున్నారు. ఆయన ఎంబిబిఎస్ చేశారు. తరువాత వివిధ ఆసుపత్రులలో పనిచేశారు. కొంతకాలం కిందటే ప్రజ్వ క్లినక్‌ను ఆరంభించారు. ప్రస్తుతం ఆయన తన ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు 10 రూపాయల ఫీజు తీసుకుని వైద్యం అందిస్తున్నారు.
 
ఆయన ఆసుపత్రికి వచ్చేవారు తెల్లరేషన్ కార్డులను కలిగిన నిరుపేదలైతే ఉచితంగానే వైద్యం చేస్తున్నారట. అవసరమైన మందులు, బెడ్‌కి సైతం నామమాత్రపు ఫీజులనే తీసుకుంటున్నారట. ఆర్మీలో పనిచేసే వారికి, దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులు, పేదలకైతే జబ్బు నయమయ్యేంత వరకు ఉచితంగానే వైద్యం అందిస్తున్నారు. ఆయన మాకు దేవుడు అంటూ చికిత్స తీసుకుని ఆరోగ్యం కుదుటపడినవారు చేతులెత్తి దణ్ణం పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments