Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతున్న బ్లాక్ ఫంగస్ - ఇప్పటికే 1179 కేసులు

ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతున్న బ్లాక్ ఫంగస్ - ఇప్పటికే 1179 కేసులు
, గురువారం, 3 జూన్ 2021 (08:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఒకవైపు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ ఆందోళన కలిగిస్తోంది. సోమవారం వరకు 1179 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకాగా అందులో 40 మంది కరోనా బారిన పడకుండా నేరుగా బ్లాక్ ఫంగస్ బారినపడినవారు ఉండటం గమనార్హం. ప్రస్తుతం 1068 మంది చికిత్స పొందుతున్నారు. 14 మంది బాధితులు మృతి చెందగా 97 మంది బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
 
ముఖ్యంగా కరోనా బారిన పడినవారిలో సైతం ఫంగస్ ఆనవాళ్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. దీంతో ఇలా ఎందుకు జరుగుతోందని వైద్య నిపుణులు సయితం తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి 40 కేసులను రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాకపోయినప్పటికీ సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాంతకమే అవుతుంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో వందలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ బారినపడి నిత్యం మరణిస్తున్నారు. దానికి తోడు తాజాగా బ్లాక్ ఫంగస్ కరోనా రోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. 
 
ముఖ్యంగా కరోనా సోకి తగ్గిన వారిలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నవారు... కరోనా సమయంలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినవారిలో ఈ ఫంగస్ వెలుగుచూస్తోందని నిన్న మొన్నటి వరకు భావించారు. తాజాగా అసలు కరోనా సోకనివారిలో సయితం ఫంగస్ ఛాయలు కనిపిస్తుండడంతో మరో గుబులు మొదలైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇరాన్‌ యుద్ధ నౌక ఖార్గ్‌ మునిగిపోయింది.. వీడియో వైరల్