Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగో జిల్లాలో కరోనా కలకలం... ఏపీలో కాల్ సెంటర్

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (11:51 IST)
హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వెలుగు చూసింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాఫ్ట్‌వేర్ టెక్కీకి కరోనా వైరస్ సోకినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఏపీ ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
జిల్లాలోని కొత్తపేట మండలం వాడపల్లి గ్రామానికి చెందిన బండారు వెంకటేస్వర్లుకు కరోనా సోకినట్టు వస్తున్న అనుమానాలపై వైద్య పరీక్షలకు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో వెంకటేశ్వర్లుకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. 
 
ఇదే అంశంపై కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని ఫోనులో మాట్లాడారు. కోన సీమ ప్రాంతంలో ప్రజలు ఆందోళన చేందొద్దని, ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. 
 
ముందు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటల్‌లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సచివాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. 0866-2410978 నెంబర్‌కు ఫోన్ చేయవచన్నారు. వెంటిలేటర్లతో ప్రత్యేక వార్డును సిద్ధం చేసినట్టు మంత్రి ఆళ్ళనాని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. నిందితుడు బిజోయ్ దాస్ విషయాలు.. ఎక్కడ నుంచి వచ్చాడంటే?

Bulli Raju: సంక్రాంతికి వస్తున్నాం.. బుల్లిరాజుకు పవన్ కల్యాణ్ ఇష్టమట...

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి బంగ్లాదేశ్ జాతీయుడే..

పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments