తెలంగాణ తగ్గినట్టే తగ్గి పెరిగిపోతున్నాయ్.. 24 గంటల్లో 42,740 కేసులు

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (10:35 IST)
తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి పెరుగుతున్నాయి. సోమవారం 600 దాటిన పాజిటివ్ కేసులు.. ఇవాళ 900 వందలు దాటాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42,740 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 921 పాజిటివ్‌ కేసులుగా తేలాయి. 
 
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు 2,65,049కి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక అటు కరోనాతో మరో నలుగురు మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1,437కి చేరింది. 
 
సోమవారం కరోనాబారి నుంచి 1,097 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 2,52,565కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,047 యాక్టివ్‌ కేసులు ఉండగా, వారిలో 8,720 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 52,01,214కి చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments