Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో వడ్డన.. వరుసగా ఐదో రోజు పెరిగిన ధరలు...

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (10:00 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా పెరిగిపోయాయి. రోజువారి ధరల సమీక్షలో భాగంగా, పెట్రోల్‌పై 8 పైస‌లు, డీజిల్‌పై 18 నుంచి 20 పైస‌లు పెంచుతూ దేశీయ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.81.59కి, డీజిల్ ధ‌ర రూ.71.41కి పెరిగింది. 
 
అదేవిధంగా మూడు మెట్రో న‌గ‌రాల్లో కూడా ధ‌ర‌లు పెరిగ‌న‌ట్లు ఇండియ‌న్ ఆయిల్ కంపెనీ ప్ర‌క‌టించింది. దీంతో ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.88.29, డీజిల్ ధ‌ర రూ.77.90గా ఉన్న‌ది. ఇక చెన్నైలో పెట్రోల్ రూ.84.64, డీజిల్ రూ.76.88, కోల్‌క‌తాలో పెట్రోల్‌ రూ.83.15, డీజిల్ రూ.74.98, హైద‌రాబాద్‌లో పెట్రోల్ రూ.84.86  డీజిల్ రూ.77.93గా ఉన్నాయి. 
 
కాగా, ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ మ‌ధ్య పెట్రోల్ ధ‌‌ర‌లు వ‌రుస‌గా నెల‌రోజుల‌పాటు పెరిగాయి. ఈ ప‌రంప‌ర సెప్టెంబ‌ర్ 22న నిలిచింది. అదేవిధంగా ఆగ‌స్టు మూడో వారం నుంచి అక్టోబ‌రు 2 వ‌ర‌కు డీజిల్ ధ‌ర‌లు పెరుగూతూనే ఉన్నాయి. అప్ప‌టి నుంచి ఆగిన పెట్రో ధ‌ర‌ల మంట మ‌ళ్లీ గ‌త శుక్ర‌వారం నుంచి ప్రారంభ‌మైంది. వ‌రుస‌గా నేటివ‌ర‌కు ప్ర‌తిరోజూ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతూనే వ‌స్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments