Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొండి కర్నాకట ప్రభుత్వం: పరీక్షలు పెట్టింది, విద్యార్థులను కరోనా బారిన పడేసింది

Webdunia
శనివారం, 4 జులై 2020 (15:22 IST)
ఊరంతటిదీ ఒక దారి అయితే ఉలిపిరి కట్టది మరో దారి అనే సామెత మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సామెత కర్నాటక ప్రభుత్వానికి ఖచ్చితంగా సరిపోతుందని అక్కడి విద్యార్థుల తల్లిదండ్రు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్నవేళ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందర్నీ ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కానీ కర్నాటక ప్రభుత్వం మాత్రం ఇందుకు ససేమిరా అన్నది పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలు జూన్ 25 నుంచి జూలై 3 వరకూ జరిగాయి. ఐతే పరీక్షలు రాసిన వారిలో 32 మంది విద్యార్థులకు కరోనాపాజిటివ్ అని తేలడం ఇప్పుడు ఆందోళకరంగా మారింది.
 
కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, జూన్ 25 మరియు జూలై 3 మధ్య పరీక్షలు రాసినవారిలో 32 మంది ఎస్‌ఎస్‌ఎల్‌సి విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. మరో ఎనభై మంది విద్యార్థులను హోంక్వారెంటైన్లో వుంచారు. ఈ పరీక్షలను 7.60 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 14,745 మంది హాజరు కాలేదు. 3,911 మంది విద్యార్థులు కంటైన్మెంట్ జోన్‌లో ఉన్నందున పరీక్షలకు హాజరు కాలేదని ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అనారోగ్యంతో మొత్తం 863 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు.
 
గత వారం, హసన్ నుండి 10వ తరగతి విద్యార్థికి కరోనావైరస్ పరీక్ష చేశారు. కరోనావైరస్ ఫలితం తేలకుండానే అతడు జూన్ 25న ఒక పరీక్ష రాసినట్లు సమాచారం. మొదటి పరీక్ష రాసిన అనంతరం అతడికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో అతడిని క్వారెంటైనుకి పంపారు.
 
COVID-19 మహమ్మారి కారణంగా అంతకుముందు మార్చి 27 మరియు ఏప్రిల్ 9 మధ్య షెడ్యూల్ చేసిన SSLC పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు జూన్ 25 నుంచి జూలై 3 మధ్య జరుగుతాయని మే నెలలో కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షా హాలులో అందరికీ హ్యాండ్ శానిటైజర్లు అందజేస్తామని, ప్రతిరోజూ తరగతి గదులు శుభ్రపరుస్తామని ప్రభుత్వం తెలిపింది.
 
పరీక్షా హాలులోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికీ ఆరోగ్య శాఖ ద్వారా ఉష్ణోగ్రత తనిఖీలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కర్ణాటక విద్యా విభాగం కంటైన్మెంట్ జోన్ల నుండి విద్యార్థులను మరియు రాష్ట్రంలో COVID-19 లక్షణాలు ఉన్నవారిని ఇతర విద్యార్థుల నుండి ప్రత్యేక గదిలో వారి SSLC పరీక్షలను రాయడానికి అనుమతించింది. లాక్డౌన్ కారణంగా తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్ళిన విద్యార్థులను దగ్గరి కేంద్రం నుండి పరీక్షలు రాయడానికి అనుమతించారు. ఐతే ఇప్పుడు పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 16 మందికి కోరనావైరస్ వున్నట్లు తేలడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments