Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క పోస్టు కోసం 10 వేల మంది నిరుద్యోగులు పోటీ.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (11:33 IST)
ఉన్నది ఒకే ఒక్క ప్రభుత్వ ఉద్యోగం. ఈ ఉద్యోగం కోసం పోటీపడే నిరుద్యోగుల సంఖ్య 10 వేల పైచిలుకు మంది. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 43 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇది దేశంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. ఈ పరిస్థితి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్‌పుర్‌ సాంకేతిక విశ్వవిద్యాలయంలో జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. డిగ్రీ, కంప్యూటర్‌ డిప్లొమా విద్యార్హతలుగా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అందులో పేర్కొన్నారు.
 
దీంతో ఈ పోస్టుకు ఇప్పటివరకూ 22,410 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో ఫీజు చెల్లించిన 10,386 మందికి హాల్‌ టికెట్లు జారీ చేశారు. ఈ నెల 9న నిర్వహించే పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 43 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఫీజు చెల్లించడానికి ఈ నెల 3 వరకూ గడువు ఉందని, ఆలోపు అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments