Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

కర్నాటకలో "పేసీఎం" - ఆంధ్రప్రదేశ్‌లో 'భారతిపే'

Advertiesment
bharathipay
, మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (19:27 IST)
కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. "పేసీఎం" అంటూ కర్నాటక వ్యాప్తంగా వెలిసిన పోస్టర్లు ఆ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేశాయి. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రతి పనికీ 40 శాతం కమీషన్లు దండుకుంటున్నారని అర్థం వచ్చేలా "పే సీఎం'' పోస్టర్లు వెలిశాయి. 
 
ఇపుడు ఇదే తరహా పోస్టర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలిశాయి. అయితే, ఇక్కడ "పే సీఎం" స్థానంలో "భారతిపే" పేరుతో వెలిశాయి. ఈ పోస్టర్లలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి ఫోటోను సైతం ముద్రించారు. 
 
ఇటీవల ఢిల్లీ రాజకీయాలను కుదిపేసిన లిక్కర్ స్కాంలో అనేక  వైకాపా నేతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీరిలో సీఎం సతీమణి భారతీ రెడ్డి పాత్ర కూడా ఉందన్నది ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో 'భారతిపే' పేరుతో పోస్టర్లు వెలవడం, అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను చర్చకు దారితీశాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబా వంగా భవిష్యవాణి.. 2023 ప్రపంచానికి డెడ్ లైనా?