Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబిషన్ ఆఫీసర్స్ రాత పరీక్షల ఫలితాలు వెల్లడి

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (16:05 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న భారత స్టేట్ బ్యాంకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పొరబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను తాజాగా వెల్లడించింది. మొత్తం 1673 పోస్టుల పీవో పోస్టుల భర్తీ కోసం ఈ రాత పరీక్షను నిర్వహించారు. తొలుత నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి జనవరి 30వ తేదీన మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు. ఆ తర్వాత ఫేజ్-3లో భాగంగా గ్రూపు ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూలను ఏప్రిల్‌లో నిర్వహించి షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల తుది జాబితాను సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రొమోషన్ విభాగం మంగళవారం వెల్లడించింది. 
 
గత యేడాది సెప్టెంబరు నెలలో ఎస్.బి.ఐ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 1673 పోస్టులకు గాను 1600 రెగ్యులర్ పోస్టులు కాగా, 73 బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులను మొత్తం మూడు దశల్లో ఎంపిక చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్షలను జనవరి నెల నాటికే పూర్తి చేయగా, మూడో దశ పరీక్షల్లో భాగంగా గ్రూపు ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూలను పూర్తి చేసి తాజాగా తుది జాబితాను రిలీజ్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments