Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింటిని నుంచి పుట్టింటికి చేరిన ఎయిర్ ఇండియా.. టాటా స్వాగత సందేశమిదే...

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (11:01 IST)
ఎయిర్ ఇండియా సంస్థ ఈ నెల 26వ తేదీ వరకు ప్రభుత్వ రంగ ఉన్నది. ఇపుడు టాటా గ్రూపు చేతుల్లోకి వెళ్లిపోయింది. నిజానికి దాదాపు ఏడు దశాబ్దాల (69 యేళ్ల క్రితం) క్రితం ఎయిర్ ఇండియాను టాటా సంస్థ ప్రారంభించింది. ఆ తర్వాత దీన్ని కేంద్రం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి నష్టాలు, లాభాలు అనే రెండు రెక్కలతో ప్రయాణికులకు సేవలు అందిస్తూ వచ్చింది. 
 
కానీ, నష్టాల నుంచి గట్టెక్కే సూచనలు లేకపోవడంతో ఈ సంస్థను కేంద్రం అమ్మకానికి పెట్టగా, తిరిగి టాటా గ్రూపు దక్కించుకుంది. మొత్తం రూ.18 వేల కోట్ల వ్యయంతో టాటా గ్రూపు బిడ్ వేసి ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుంది. దీంతో అత్తారిల్లు (కేంద్రం) నుంచి పుట్టినిల్లు (టాటా)కి ఎయిర్ ఇండియా చేరింది. ఈ ప్రక్రియ గురువారం ముగింది. 
 
ఆ తర్వాత ఎయిర్ ఇండియా పేరు మారిపోయింది. ఎయిర్ ఇండియా ఇపుడు టాటా ఎయిర్ ఇండియాగా మారింది. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా కాక్‌పిట్ క్రూ వెల్‌కమ్ అనౌన్స్‌మెంట్ కోసం ఓ సర్క్యులర్‌ను జారీచేసింది. "వెల్‌కమ్ టు ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, వియ్ హోప్ యూ ఎంజాయ్‌ ది జర్నీ" అంటూ సందేశాన్ని రూపొందించిది. "ప్రియమైన అతిథులారా.. మీ కెప్టెన్ మాట్లాడుతున్నారు. ఈ చారిత్రాత్మక విమానానికి స్వాగతం. ఇది మీకు ఒక ప్రత్యేకమైన ప్రయాణం" అనే అనౌన్స్‌మెంట్‌ను వినిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments