Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాటా చేతికి ఎయిర్ ఇండియా - 68 యేళ్ల తర్వాత...

Advertiesment
టాటా చేతికి ఎయిర్ ఇండియా - 68 యేళ్ల తర్వాత...
, గురువారం, 27 జనవరి 2022 (13:15 IST)
దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇపుడు టాటా గ్రూపు చేతికి వెళ్లింది. 68 యేళ్ల తర్వాత తిరిగి ఈ సంస్థను టాటా గ్రూపు సొంతం చేసుకుంది. అధికారికంగా ఎయిర్ ఇండియాను  ప్రభుత్వం గురువారం అప్పగించనుంది. 
 
కాగా, నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రైవేట్ బిడ్లను ఆహ్వానించింది. ఇందులో టాటా గ్రూపునకు చెందిన ఒక సబ్సిడరీ కంపెనీ తలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బిడ్‌ను దాఖలు చేసింది. దీంతో గత యేడాది అక్టోబరు 8వ తేదీన ఈ కంపెనీకో ఎయిరిండియా దక్కినట్టు కేంద్రం ప్రకటించింది. 
 
ఎయిర్ ఇండియాను టాటా గ్రూపునకు విక్రయించినట్టు అక్టోబరు 8వ తేదీన అధికారింగా ప్రకటించారు. ఆ తర్వాత మూడు రోజులకు ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసింది. అక్టోబరు 25న టాటా గ్రూపుతో పర్చేజ్ ఆఫ్ అగ్రిమెంట్ (ఎస్పీఏ)ను ప్రభుత్వం కుదుర్చుకుంది. అన్ని అధికారిక లాంఛనాలు పూర్తికావడంతో ఎయిరిండియాను టాట గ్రూపు చేతుల్లోకి వెళ్లనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాణిపాకం రథ చక్రాలకు నిప్పుపెట్టిన దుండగులు