Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాటా చేతికి ఎయిరిండియా: 68 ఏళ్ల తర్వాత మళ్లీ..?

టాటా చేతికి ఎయిరిండియా: 68 ఏళ్ల తర్వాత మళ్లీ..?
, సోమవారం, 24 జనవరి 2022 (23:21 IST)
జనవరి 27వ తేదీన ఎయిరిండియా పూర్తిగా టాటా పరం కానుంది. జనవరి 27వ తేదీ నుంచి ఎయిరిండియా నిర్వహణ టాటాలు అందుకోవడం జరుగుతుందని ఎయిరిండియా డైరెక్టర్ (ఫైనాన్స్) వినోద్ హెజ్మాది సిబ్బందికి ఈ మెయిల్ ద్వారా తెలియచేశారని తెలుస్తోంది. 
 
ఎయిరిండియాతో రాకతో టాటా గ్రూప్ లోకి మూడో విమానాయన బ్రాండ్ వచ్చినట్లవుతుంది. ఎయిరిండియా మొత్తం అప్పుల ఊబిలో కూరుకపోయింది. దీంతో 100 శాతం వాటాలు పొందేందుకు రూ. 18 వేల కోట్లతో టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ టాలెస్ ప్రైవేటు లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది. గత సంవత్సరం అక్టోబర్ 08వ తేదీన కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 
 
ఇకపోతే.. ఎయిర్ ఇండియా అసలు పేరు టాటా ఎయిర్ లైన్స్. 1932లో టాటా ఎయిర్ లైన్స్ ను పారిశ్రామిక దిగ్గజం జేఆర్డీ టాటా స్ధాపించగా, స్వాతంత్ర్యం అనంతరం కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయీకరణ చేసింది. దీని పేరును ఎయిర్ ఇండియాగా మార్చింది. 68 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిరిండియా టాటా చేతికొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్జీమర్స్‌తో బాధపడే వ్యక్తి విపక్షనేత.. అంతా దురదృష్టం.. కొడాలి నాని