Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రైవేటు పరం?

Webdunia
బుధవారం, 10 జులై 2019 (09:56 IST)
భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, దేశంలోని పలు ప్రధాన రైల్వే స్టేషన్ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను తొలుత ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇదే జరిగితే ప్రయాణికులపై భారం పడనుంది. ఈ నిర్ణయాన్ని రైల్వే కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆందోళనకు దిగాలని భావిస్తున్నాయి. 
 
దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల నిర్వహణతో పాటు ఫ్లాట్‌ఫాం టిక్కెట్ల విక్రయం పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్ వంటి సేవలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్‌డీసీ) చేతికి అప్పగించడం జరిగింది. దీంతోపాటు జోన్లలో ఉన్న మరికొన్ని రైల్వే స్టేషన్లు కూడా ఐఆర్ఎస్‌డీసీ చేతికే అప్పగించాలని భావిస్తోంది. 
 
ప్రధాన రైల్వే స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ఫ్లాట్‌ఫాం టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే, ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. దీంతో శాశ్వత కార్మికులపై అమితమైన భారంపడనుంది. దీంతో రైల్వే కార్మికులు రైల్వేశాఖ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments