పీఎంఐ టెలిపోర్ట్‌ క్విజ్‌; ఐదుగురు అదృష్టవంతులకు ఐపీఎల్‌ 2021 ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (23:12 IST)
పరిమ్యాచ్‌ బ్రాండ్‌ కోసం విస్తరణ వ్యూహ అమలు, అభివృద్ధిలో నిమగ్నమైన సేవా సంస్ధ పీఎంఐ, ఇప్పుడు టెలిపోర్ట్‌ క్విజ్‌ ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ క్విజ్‌ పోటీలో విజేతలుగా నిలిచిన ఐదుగురు అదృష్టవంతులకు యుఏఈలో త్వరలో జరుగనున్న ఐపీఎల్‌ ద్వితీయార్ధపు పోటీలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం లభిస్తుంది. ఈ క్విజ్‌ విజేతలకు అతి పెద్ద లీగ్‌ అభిమానులుగా టైటిల్‌ మాత్రమే లభించడం కాదు, ఐపీఎల్‌ 2021ను స్టేడియంలో ప్రత్యక్షంగా ఇతర ప్రేక్షకుల నడుమ చూసి ఆనందించే అవకాశం కూడా లభిస్తుంది.
 
పరిమ్యాచ్‌ పోర్టల్‌పై ఈ క్రీడను భారతీయ ప్రేక్షకులు అమితంగా అభిమానిస్తుంటారు. వాస్తవ జీవితంలో కూడా ఈ క్రీడ పట్ల అమితాసక్తిని చూపుతుంటారు. వారి ఆసక్తి, ఉత్సాహం, స్ఫూర్తిని ఈ బ్రాండ్‌ ప్రదర్శిస్తుంది. ఈ కారణం చేతనే ఈ కంపెనీ, టెలిపోర్ట్‌ పోటీని పరిచయం చేస్తుంది. భారతీయ క్రీడాభిమానులకు అపూర్వమైన అవకాశాన్నీ అందిస్తుంది. అదృష్టవంతులైన అభిమానులు ఎమిరేట్స్‌ వెళ్లే అవకాశం మాత్రమే కాదు, అతి పెద్దగేమ్‌ను ప్రేక్షకుల నడుమ కూర్చుని చూసే అవకాశమూ పొందగలరు.
 
పీఎంఐ- సీఎంఓ దిమిత్రి బెలానిన్‌ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, ‘‘టెలిపోర్ట్‌ క్విజ్‌తో, మా భారతీయ వినియోగదారుల కోరికను తీర్చాలనుకుంటున్నాము. వారికి తగిన గుర్తింపును పొందే అవకాశం మాత్రమే కాదు, యుఏఈ ఎగిరిపోయే అవకాశమూ అందిస్తున్నాం. వినోద రంగంలో వినూత్నమైన సేవలను అందించడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఈ పోటీని పరిచయం చేయడం ద్వారా ఓ  అద్వితీయమైన అవకాశాన్ని అందించడానికి మేము ప్రణాళిక చేశాం.
 
ఇది భారతదేశం నుంచి మేము అందుకుంటున్న ప్రేమాభిమానాలకు మా కృతజ్ఞతను వెల్లడించడాన్ని ప్రతిబింబిస్తుంది. మాకు చక్కటి గుర్తింపును అందించిన భారతదేశంలోని క్రికెట్‌ అభిమానులకు మేము ధన్యవాదములు తెలుపుతున్నాం. ఈ కారణం చేతనే వారి పట్ల మా అనుబంధానికి గుర్తుగా ఐపీఎల్‌ ద్వితీయార్థంను యుఏఈలో వ్యక్తిగతంగా వీక్షించే అవకాశాన్నీ అందిస్తున్నాం..’’ అని అన్నారు
 
అభిమానుల హృదయాలను గెలుచుకునేందుకు మరియు వారికి సంతోషాన్ని అందించేందుకు, వారందిస్తున్న మద్దతును ప్రశంసించేందుకు మేము అనుసరిస్తున్న మార్గం ఈ పోటీ. తమ చేరికను మరింతగా విస్తరించడంతో పాటుగా వినియోగదారుల అభిప్రాయాలను మిళితం చేసేందుకు అత్యంత ఆసక్తికరమైన టెలిపోర్ట్‌ క్విజ్‌ను ఆవిష్కరించేందుకు పీఎంఐ సిద్ధంగా ఉంది. ప్రత్యక్షంగా క్రీడను తిలకించేందుకు విదేశాలకు ఎగిరిపోయే  అవకాశాన్ని ఇది ప్రేక్షకులకు అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments