Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 14 సీజన్ పునఃప్రారంభం ఎపుడంటే...

ఐపీఎల్ 14 సీజన్ పునఃప్రారంభం ఎపుడంటే...
, సోమవారం, 26 జులై 2021 (07:28 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ మళ్లీ పునఃప్రారంభంకానుంది. కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి కారణంగా ఈ టోర్నీని బీసీసీఐ రద్దు చేసింది. ఈ ఆగిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. 
 
భార‌త క్రికెట్ బోర్డు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ను మ‌రోసారి యూఏఈలో నిర్వ‌హించ‌బోతున్న‌ద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఐపీఎల్‌కు సంబంధించి జైషా ఇప్ప‌టికే యూఏఈ సాంస్కృతిక‌, యువ‌జ‌న, సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి షేక్ నహ్యాన్‌ను క‌లిసి మాట్లాడారు.
 
తొలిరోజైన సెప్టెంబ‌రు 19న డిఫెండింగ్ చాంపియ‌న్స్ ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబ‌రు 10న క్వాలిఫ‌య‌ర్ 1, అక్టోబ‌ర్ 11న ఎలిమినేట‌ర్‌ మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. అక్టోబ‌రు 13న క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్ నిర్వ‌హించ‌నున్నారు. 
 
అక్టోబ‌రు 15న ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. మేం సెప్టెంబ‌రు 19న ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్‌కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-14వ సీజ‌న్‌ను పున‌రుద్ధ‌రించ‌నున్నాం. అక్టోబ‌రు 10, 13 తేదీల్లో క్వాలిఫ‌య‌ర్ 1, 2 మ్యాచ్‌లు నిర్వ‌హిస్తాం. అక్టోబ‌రు 11న ఎలిమినేట‌ర్ మ్యాచ్ జ‌రుగుతుంది. అన్ని మ్యాచ్‌ల‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలను త్వ‌ర‌లో అన్ని టీమ్‌లకు తెలియ‌జేస్తాం అని బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లంకతో తొలి ట్వంటీ20 సమరం : భారత్ విజయం