Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ రేట్లు

Webdunia
శనివారం, 29 మే 2021 (10:51 IST)
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెట్రోల్‌ ధరలు నిలకడగా కొనసాగుతూ వచ్చాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత నెలలో ముడి చమురు ఖరీదైన తర్వాత సైతం పెట్రోల్, డీజిల్‌ రేట్లు పెరుగలేదు. అయితే, ముడి చమురు రేట్లు తగ్గిన అనంతరం పెట్రోల్‌, డీజిల్‌పై నాలుగుసార్లు తగ్గించారు. దీంతో పెట్రోల్‌ లీటర్‌కు 77 పైసలు, డీజిల్‌పై 74 పైసలు వరకు తగ్గించాయి. 
 
ఈ నెలలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వరుసగా, రోజువిడిచి రోజు చమురు కంపెనీలు ధరలను పెంచుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు 15 సార్లు ధరలు పెరగ్గా.. లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.61, డీజిల్‌పై రూ.4.11 పెంచాయి. అలాగే.. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.100.11 గా ఉండగా.. రూ. 94.43గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.97.63, లీటర్‌ డీజిల్‌ రూ.92.54కు పెరిగింది.
 
ఇకపోతే.. ఒపెక్‌ దేశాల మంత్రివర్గ సమావేశం జూన్‌ 1న జరుగనుంది. రాబోయే జూలైలో ముడి చమురు ఉత్పత్తిని పెంచుతారనే ఊహాగానాలున్నాయి. దీంతో ముడి చమురు మార్కెట్ ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగాయి. యూఎస్ మార్కెట్లో బ్రెంట్ ముడి శుక్రవారం బ్యారెల్‌కు 69.46 డాలర్లు పలికింది. డబ్ల్యూటీఐ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.53 డాలర్లు తగ్గి.. 66.32 డాలర్లకు చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments