Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా కష్టకాలంలోనూ బ్రేకులు లేని పెట్రోల్ ధరలు

కరోనా కష్టకాలంలోనూ బ్రేకులు లేని పెట్రోల్ ధరలు
, గురువారం, 6 మే 2021 (11:46 IST)
కరోనా కష్టకాలంలోనూ కేంద్ర ప్రభుత్వ చమురు రంగ సంస్థలు కనికరించడం లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ వారం పదిరోజుల పాటు పెట్రోల్, డీజిల్ బాదుడుకూ దూరంగా ఉన్న ఆయిల్ కంపెనీలు... ఇపుడు మళ్లీ ధరలను పెంచుతుయన్నాయి. రోజువారీ సమీక్షను ఆసరాగా తీసుకున్న ఆయిల్ కార్పొరేషన్లు ధరలను పెంచుతున్నాయి. వరుసగా మూడో రోజైన గురువారం కూడా ఈ ధరలను పెంచాయి. 
 
ఐదు రాష్ట్రాల ఫ‌లితాలు వెలువ‌డిన మ‌రుస‌టి రోజు నుంచే దేశీయ చ‌మురు కంపెనీలు ధ‌ర‌ల‌ను పెంచుతూ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో వ‌రుస‌గా మూడో రోజూ వాహ‌ణ‌దారుల‌పై భారం మోపాయి. బుధవారం లీట‌ర్ పెట్రోల్‌పై 19 పైస‌లు, లీటర్ డీజిల్‌పై 21 పైసల చొప్పున పెంచ‌గా, గురువారం మరోసారి 25 పైస‌లు, 30 పైస‌ల చొప్పున బాదాయి. 
 
దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.90.99, డీజిల్‌ రూ.81.42కు చేరింది. ఇక తాజా పెంపుతో ముంబైలో పెట్రోల్ రూ.97.34, డీజిల్‌ రూ.88.39, చెన్నైలో పెట్రోల్‌ రూ.92.90, డీజిల్‌ రూ.86.35, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.91.14, డీజిల్‌ రూ.84.26కు చేరాయి.
 
ఇక బెంగ‌ళూరులో పెట్రోల్‌ రూ.94.01, డీజిల్‌ రూ.86.31కు, హైద‌రాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.57, డీజిల్‌ రూ.88.77కు, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.97.03, డీజిల్‌ రూ.89.62కు చేరాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధ‌మైన ప‌న్నులు విధిస్తుండ‌టంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో తేడాలు ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ తోక చుక్క 1986లో కనిపించిందట..