తగ్గిన పసిడి ధరలు.. పెరిగిన వెండి ధరలు

Webdunia
శనివారం, 29 మే 2021 (10:26 IST)
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. బంగారం ధర శనివారం కూడా దిగొచ్చింది. పసిడి రేటు పడిపోవడం ఇది వరుసగా రెండో రోజు. దీనితో పసిడి ప్రియులకి కాస్త రిలీఫ్‌గా ఉంటుందనే చెప్పాలి. కానీ వెండి ధర శనివారం పైపైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.240 తగ్గింది. దీంతో రేటు రూ.49,860కు క్షీణించింది.
 
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇలానే తగ్గడం తో రూ.45,700కు దిగి వచ్చింది. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌‌లో బంగారం ధర పెరిగింది. 0.42 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1903 డాలర్లకు చేరింది.
 
ఇక వెండి అయితే రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 0.43 శాతం పెరుగుదలతో 28.06 డాలర్లకు ఎగసింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలైన వాటి ప్రభావం బంగారం మీద పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments