Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదుడే బాదుడు.. పెరిగిన వంటగ్యాస్ ధరలు..

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (10:02 IST)
దేశీయ చమురు కంపెనీలు వంట గ్యాస్ ధరలను పెంచేస్తున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి వంటగ్యాస్‌ ధరను పెంచాయి. గత నెల 25న సిలిండర్‌పై రూ.25 పెంచిన కంపెనీలు తాజాగా మరో రూ.25 భారం మోపాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.819కి చేరింది. ఫిబ్రవరి నెలలో సిలిండర్‌ ధరలను మూడు సార్లు సవరించిన సంగతి తెలిసిందే. ఆ నెలలో మొత్తంగా రూ.100 అధికమయ్యింది.
 
కాగా, గతేడాది డిసెంబర్‌ 1 నుంచి ఇప్పటివరకు వంటగ్యాస్‌పై రూ.225 పెరిగాయి. డిసెంబర్‌ 1న 14 కిలోల సిలిండర్‌ ధర రూ.594గా ఉన్నది. రూ.50 పెంచడంతో రూ.644కు చేరింది. మళ్లీ జనవరి 1న రూ.50 వడ్డించడంతో అది రూ.694కు పెరిగింది. అంతటితో ఆగని కంపెనీలు ఫిబ్రవరి 4న రూ.25 పెంచాయి. దీంతో సిలిండర్‌ ధర రూ.719కి చేరింది. అదేనెలలో పదిరోజుల వ్యవధిలోనే మరో రూ.50 మేర వినియోగదారులపై భారం మోపాయి.
 
ఫిబ్రవరి 14న రూ.50 పెంపుతో రూ.769 పెరిగింది. చివరగా ఫిబ్రవరి 25న రూ.25 మేర గ్యాస్‌ ధరను అధికం చేయడంతో రూ.794కు చేరింది. తాజాగా మరో రూ.25 వడ్డించడంతో సిలిండర్‌ వెల రూ.819కి పెరిగింది. ఇవాళ ఉదయమే కమర్షియల్‌ గ్యాస్‌పై రూ.95 వడ్డించాయి. దీంతో వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్‌ ధర రూ.1614కు చేరిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Ravi Mohan: రవికి చెక్ పెట్టిన భార్య ఆర్తి.. భరణం కింద రూ.40లక్షలు ఇవ్వాల్సిందే

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments