ఇండిగో విమానాలు రద్దు.. రంగంలోకి దిగిన కేంద్రం... చార్జీల పెరుగుదలకు బ్రేక్

ఠాగూర్
శనివారం, 6 డిశెంబరు 2025 (20:17 IST)
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఈ విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం స్పందించింది. ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్రం పౌర విమానయాన శాఖ, విమాన చార్జీలపై గరిష్ట ధరల పరిమితి విధిస్తూ శనివారం కీలక ఆదేశాలు జారీచేసింది. అదేసమయంలో విమాన చార్జీలను కూడా నిర్ణయించింది. 
 
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఇతర విమాన సంస్థలు ఇష్టారాజ్యంగా విమాన చార్జీలను పెంచేశాయి. సాధారణంగా రూ.5 వేలు నుంచి రూ.7 వేలు మధ్య ఉండే చార్జీని ఏకంగా రూ.లక్ష వరకు పెంచేశాయి. ఈ సంక్షోభ సమయంలో విమానయాన సంస్థలు అవకాశవాదంగా వ్యవహరించకుండా నిరోధించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
 
ఇందులోభాగంగా కొత్త నిబంధనల మేరకు ఎకానమీ క్లాస్ టిక్కెట్లకు దూరాన్ని బట్టి గరిష్ట ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి గరిష్ట చార్జీ రూ.7500, 500 నుంచి 1000 కిలోమీటర్ల మధ్య రూ.12 వేలు, 1000 నుంచి 1500 కిలోమీటర్ల మధ్య రూ.15 వేలు, 15 వేల కిలోమీటర్లు దాటిన ప్రయాణికులకు గరిష్టంగా 18 వేలగా నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం