Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న జీఎస్టీ వసూళ్లు - తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే...

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (09:13 IST)
దేశంలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. గత నెలలో ఏకంగా 1.6లృ2 లక్షల కోట్ల రూపాయల మేరకు జీఎస్టీ వసూళ్లు సాధించినట్టు కేంద్రం వెల్లడించింది. గత యేడాది సెప్టెంబరు నెలతో పోల్చితే ఈ వసూళ్లు పది శాతం అధికమని పేర్కొంది. పైగా, ఈ యేడాది రూ.1.62 లక్షల జీఎస్టీ వసూళ్లు దాటడం ఇదే నాలుగోసారని కేంద్రం తెలిపింది. 
 
2022 సెప్టెంబరు నెలలో రూ.1.47 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ప్రస్తుతం ఇది రూ.1.62 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబరు కేంద్ర జీఎస్టీ రూ.29,818 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ రూ.37,657 కోట్లు. సమీకృత జీఎస్టీ రూ.83,623 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలైన రూ.41,145 కోట్లు కలుపుకుని) అని కేంద్రం తెలిపింది. ఇక సెస్ రూపంలో రూ.11613 కోట్లుగా ఉందని తెలిపింది. 
 
ఇందులో తెలంగాణ రాష్ట్ర నుంచి రూ.5226 కోట్లు వసూలు కాగా, ఏపీ నుంచి రూ.3915 కోట్ల మేరకు జీఎస్టీ వసూలైనట్టు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వసూలైన జీఎస్టీ వసూళ్లను పరిశీలిస్తే, ఏప్రిల్ నెలలో రూ.181035, మే నెలలో రూ.157090, జూన్ నెలలో రూ.161497, జూలై నెలలో రూ.165105, ఆగస్టు నెలలో రూ.159069, సెప్టెంబరు నెలలో రూ.162712 లక్షల కోట్లు చొప్పున జీఎస్టీ పన్ను వసూలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments