Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెయింటర్‌తో పెళ్లి చేస్తున్నారనీ.. ఎంబీఏ విద్యార్థిని సూసైడ్

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (08:58 IST)
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో ఓ విషాదకర ఘటన జరిగింది. తనకు పెయింటర్‌ను ఇచ్చి పెళ్ళి చేసేందుకు ఏర్పాట్లు చేయాడాన్ని జీర్ణించుకోలేని ఎంబీఏ విద్యాభ్యాసం చేస్తున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జీడిమెట్ల సుభాష్ నగర్ లాస్ట్ బస్టాప్ ప్రాంతంలో ఉండే కరీంశెట్టి జన్ని, సత్యవతి అనే దంపతుల కుమార్తె యవనాగదుర్గ (23). ఎంబీఏ చదువుతుంది. ఈమెకు పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులు స్థానికంగా ఉండే ఓ పెయింటర్‌ను వరుడుగా ఖరారు చేసి గత ఫిబ్రవరి నెలలో నిశ్చితార్థం చేశారు. అయితే, అతనితో పెళ్లి ఏమాత్రం ఇష్టం లేని ఆ యువతి.. అప్పటి నుంటి ముభావంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో ఇటీవలే పెళ్లి ముహూర్తం ఖరారు చేసి, పెళ్లి ఏర్పాట్లు కూడా ప్రారంభించారు.
 
ఈ నేపథ్యంలో సెప్టెంబరు 29వ తేదీన యువతి తల్లిదండ్రులు పెళ్లి పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఆ యువతి, సోదరుడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. అయితే, భోజనం తెచ్చేందుకు సోదరుడు బయటకు వెళ్లగా, నాగదుర్గ ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, పెయింటర్‌తో పెళ్లి ఇష్టంలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments