Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 మార్చి నాటికి ఏటీఎంల మూసివేత

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (15:43 IST)
దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో సగం ఏటీఎంలు మూతపడనున్నాయి. ఏటీఎం నిర్వహణ తలకు మించిన భారంగా మారడంతో అన్ని బ్యాంకులు ఈ తరహా నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయాన్ని ఏటీఎంల పరిశ్రమ సమాఖ్య ధృవీకరిస్తోంది కూడా. 
 
ఏటీఎంల నిర్వహణ, నియంత్రణ విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఏటీఎంల నిర్వహణ తలకు మించిన భారంగా మారిందంటూ ఏటీఎంల సమాఖ్య ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2.38 లక్షల ఏటీఎంలలో సగం 2019 మార్చికల్లా మూసివేసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇదే జరిగితే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు, అనేక రంగాలపై ప్రభావం పడనుందని పేర్కొంది. 
 
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలు ఎక్కువ మూసివేతకు గురవుతాయని తెలిపింది. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీల సొమ్మును ఏటీఎం నుంచి పొందడం ఇకనుంచి ప్రజలకు కష్టంగా మారనుందని తెలిపింది. 
 
హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో వచ్చిన నవీకరణలు, క్యాష్‌ మేనేజ్‌మెంట్ స్టాండర్డ్స్‌, క్యాష్‌ను లోడ్ చేయడం వంటి విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఏటీఎంలను నిర్వహించడం భారంగా పరిణమించిందని తెలిపింది. ఏటీఎంల నిర్వహణపై 3వేల కోట్ల భారం పడతుందని అంచనా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments