Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి నెలలో రికార్డు స్థాయిలో బంగారు దిగుమతులు

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (10:45 IST)
దేశ ప్రజలకు బంగారంపై మక్కువ మరింతగా పెరిగిపోతుంది. ఒకవైపు బంగారం ధరలు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నప్పటికీ వీటి కొనుగోళ్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా రికార్డు స్థాయిల్లో విదేశాల నుంచి బంగారం దిగుమతులు జరుగుతున్నాయి. ఈ యేడాది మొదటి నెల అయిన జనవరి నెలలో ఏకంగా 2.68 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. గత యేడాదితో పోల్చితే ఈ మొత్తం 40.9 శాతం అధికమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, ఈ యేడాదిలో బంగారం ధరలు ఏకంగా 11 శాతం మేరకు పెరిగినట్టు తెలిపింది. 
 
గత యేడాది జనవరి నెలలో బంగారం దిగుమతుల విలువ 1.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇపుడది 2.68 బిలియన్ డాలర్ల విలువకు చేరుకుంది. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జనవరి వరకు దేశంలోకి 50 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత యేడాది ఇదే సమయంలో ఈ దిగుమతుల విలువ 37.85 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, కొత్త యేడాదిలో పసిడి ధర 11 శాతం మేరకు పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.88200గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments