Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి నెలలో రికార్డు స్థాయిలో బంగారు దిగుమతులు

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (10:45 IST)
దేశ ప్రజలకు బంగారంపై మక్కువ మరింతగా పెరిగిపోతుంది. ఒకవైపు బంగారం ధరలు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నప్పటికీ వీటి కొనుగోళ్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా రికార్డు స్థాయిల్లో విదేశాల నుంచి బంగారం దిగుమతులు జరుగుతున్నాయి. ఈ యేడాది మొదటి నెల అయిన జనవరి నెలలో ఏకంగా 2.68 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. గత యేడాదితో పోల్చితే ఈ మొత్తం 40.9 శాతం అధికమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, ఈ యేడాదిలో బంగారం ధరలు ఏకంగా 11 శాతం మేరకు పెరిగినట్టు తెలిపింది. 
 
గత యేడాది జనవరి నెలలో బంగారం దిగుమతుల విలువ 1.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇపుడది 2.68 బిలియన్ డాలర్ల విలువకు చేరుకుంది. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జనవరి వరకు దేశంలోకి 50 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత యేడాది ఇదే సమయంలో ఈ దిగుమతుల విలువ 37.85 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, కొత్త యేడాదిలో పసిడి ధర 11 శాతం మేరకు పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.88200గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments