Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాస్ట్ ట్యాగ్: టోల్ చెల్లింపులు తప్పనిసరి.. అసలు ఛార్జీకి రెండింతలు

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (10:55 IST)
వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం విధించిన గడువు ముగియనుంది. ఈ గడువును మరోసారి పొడిగించబోమని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం నాడు స్పష్టమైన ప్రకటన చేశారు. ఫలితంగా.. ఇకపై ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాదారులు అసలు టోల్ చార్జీకి రెండింతలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. సోమవారం అర్థరాత్రి నుంచి టోల్ చెల్లింపులు సరళతరం చేసే ఫాస్ట్ ట్యాగ్ విధానం తప్పనిసరి కానుంది. 
 
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ప్రవాహాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో టోల్ గేట్ల వద్ద ఉండే ప్రత్యేకమైన సెన్సర్లు వాహనంపై అమర్చిన ఫాస్ట్‌ట్యాగ్‌ను రీడ్ చేసి టోల్ చార్జీలను స్వీకరిస్తాయి. ఈ మొత్తం వ్యవహారం ఆటోమెటిక్ విధానంలో, టోల్ సిబ్బంది కలుగ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే జరిగిపోతుంది. 
 
ప్రీపెయిడ్ విధానంలో ప్రేశపెట్టిన ఈ ఫాస్ట్‌ట్యాగ్‌ వ్యాలెట్లలో నగదు అయిపోయిన ప్రతిసారీ వాహనదారులు రీచార్జ్ చేయడం ద్వారా నగదు నింపాల్సి ఉంటుంది. టోల్ గేట్ సిబ్బందికి చెల్లింపులు జరిపే పాత విధానాని ఫాస్ట్ ట్యాగ్‌ పద్ధతి ముగింపు పలకనుంది. ఫలితంగా.. టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాల్సిన అగత్యం తప్పి ట్రాఫిక్ మరింత సాఫీగా సాగిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments