Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాస్ట్ ట్యాగ్: టోల్ చెల్లింపులు తప్పనిసరి.. అసలు ఛార్జీకి రెండింతలు

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (10:55 IST)
వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం విధించిన గడువు ముగియనుంది. ఈ గడువును మరోసారి పొడిగించబోమని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం నాడు స్పష్టమైన ప్రకటన చేశారు. ఫలితంగా.. ఇకపై ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాదారులు అసలు టోల్ చార్జీకి రెండింతలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. సోమవారం అర్థరాత్రి నుంచి టోల్ చెల్లింపులు సరళతరం చేసే ఫాస్ట్ ట్యాగ్ విధానం తప్పనిసరి కానుంది. 
 
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ప్రవాహాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో టోల్ గేట్ల వద్ద ఉండే ప్రత్యేకమైన సెన్సర్లు వాహనంపై అమర్చిన ఫాస్ట్‌ట్యాగ్‌ను రీడ్ చేసి టోల్ చార్జీలను స్వీకరిస్తాయి. ఈ మొత్తం వ్యవహారం ఆటోమెటిక్ విధానంలో, టోల్ సిబ్బంది కలుగ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే జరిగిపోతుంది. 
 
ప్రీపెయిడ్ విధానంలో ప్రేశపెట్టిన ఈ ఫాస్ట్‌ట్యాగ్‌ వ్యాలెట్లలో నగదు అయిపోయిన ప్రతిసారీ వాహనదారులు రీచార్జ్ చేయడం ద్వారా నగదు నింపాల్సి ఉంటుంది. టోల్ గేట్ సిబ్బందికి చెల్లింపులు జరిపే పాత విధానాని ఫాస్ట్ ట్యాగ్‌ పద్ధతి ముగింపు పలకనుంది. ఫలితంగా.. టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాల్సిన అగత్యం తప్పి ట్రాఫిక్ మరింత సాఫీగా సాగిపోతుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments