Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Budget2019 : క్లీన్ బ్యాంకింగ్ మా లక్ష్యం.. 2022లో నవభారత్ నిర్మాణం.. విత్తమంత్రి

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:26 IST)
కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ లోక్‌సభలో 2019-20 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్లీన్ బ్యాంకింగ్ తమ లక్ష్యమన్నారు. తమ హయాంలో రూ.3 లక్షల కోట్ల మొండి బాకీలను వసూలు చేసినట్టు చెప్పారు. 2022లో నవభారాతాన్ని నిర్మించబోతున్నట్టు చెప్పారు. 
 
గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రేటు 10 శాతంగా దాటితే, తమ పాలనలో ఇది కేవలం 4.6 శాతంగా ఉందన్నారు. డిసెంబరు నెలలో 2.19 శాతంగా ఉందని గుర్తుచేశారు. సహకార సమాఖ్య వ్యవస్థలో అన్ని రాష్ట్రాలకు తగిన నిధులు ఇస్తామన్నారు. జీఎస్టీతో సహా ఇతర పన్నుల్లో సంస్కరణలపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. 
 
దేశంలోని బ్యాంకుల నిజస్థితిని దేశం ముందుంచాలని భారతీయ రిజర్వు బ్యాంకును కోరినట్టు చెప్పారు. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించామని, దీనివల్ల విద్యా రంగంలో 2 లక్షల సీట్లు పెరుగుతాయని చెప్పారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొచ్చామ్నారు. దివాళా చట్టం ద్వారా అక్రమార్కులకు ముకుతాడు వేసినట్టు చెప్పారు. గ్రామ సడక్ యోజన ద్వారా రోడ్ నిర్మాణం మూడు రెట్లు పెరిగిందని, ఫలితంగా మారుమూల ప్రాంతాలకు సైతం బసులు వెళ్ళగలుగుతున్నాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments