Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోక్‌సభ బరిలో ఉపాసన... తెరాస అభ్యర్థిగా చెర్రీ వైఫ్?!

లోక్‌సభ బరిలో ఉపాసన... తెరాస అభ్యర్థిగా చెర్రీ వైఫ్?!
, సోమవారం, 28 జనవరి 2019 (20:54 IST)
హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ తరపున పోటీ చేయవచ్చనే ఊహాగానాలు వినొస్తున్నాయి. అదీకూడా తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై ఆమె పోటీ చేయవచ్చంటూ ఈ ప్రచారం సాగుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ విషయం చెర్రీ వైఫ్ ఉపాసన దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె వెంటనే స్పందించారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై టీఆర్ఎస్ తరపున తాను పోటీ చేయబోతున్నారనే వార్తా కథనం ఉత్తుత్తిదే. ఈ కథనంలో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. అందులో వాస్తవం లేదని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న జాబ్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నట్టు చెప్పారు. సంగీతా రెడ్డి (విశ్వేశ్వర్ రెడ్డి భార్య) తన బాస్ అని చెప్పారు. చేవెళ్లలో తన చిన్నాన్న విశ్వేశ్వర్ రెడ్డి మంచి పనులు చేస్తున్నారని ఆమె గుర్తుచేశారు. 
 
కాగా, దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డెస్క్‌లో ఉపాసన కూర్చొని, ఈ స్టాల్‌కు వచ్చిన పెట్టుబడిదారులకు రాష్ట్రంలో పెట్టుబడులకు గల కారణాలను వివరించారు. దీనిపై తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎంతగానో అభినందించారు కూడా. ఈ నేపథ్యంలో ఉపాసన తెరాస తరపున ప్రచారం చేయనున్నారనే పుకార్లు వైరల్ కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో మీడియా కెమేరాలు చూసి పరుగెత్తిన లగడపాటి... ఎందుకో తెలుసా?