Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BudgetSession2019 : భారత్ ఇమేజ్ పెరిగింది.. ఆరో ఆర్థిక వ్యవస్థ : పియూష్ గోయల్

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:11 IST)
గత ఐదేళ్ళ కాలంలో భారత్ ఇమేజ్ పెరిగిందని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఆయన శుక్రవారం 11 గంటలకు లోక్‌సభలో 16వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆయన స్థానంలో పియూష్ గోయల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది తాత్కాలిక బడ్జెట్టేనని స్పష్టం చేశారు. అలాగే, ఆర్థిక మంత్రి జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 
 
గత ఎన్నికల్లో తమకు ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో భారత్ ఇమేజ్‌తో పాటు ఆత్మ విశ్వాసం పెరిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరికీ టాయిలెట్‌తో కూడిన ఇంటిని నిర్మించడమే తమ ధ్యేయమన్నారు. ప్రజల ఆదాయం రెట్టింపు కావాలన్నారు. ఉగ్రవాద, తీవ్రవాద రహిత దేశంగా అవతరించాలన్నారు. అదేసమయంలో వృద్ధిరేటులో వేగం పుంజుకుందన్నారు. మనది ప్రపంచంలో ఆరో ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments