Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BudgetSession2019 : ఉద్యోగులకు గుడ్‌న్యూస్ : రూ.5 లక్షల వరకు పన్ను లేదు...

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:35 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వ్యక్తిగత ఆదాయ పన్నుదారులకు రూ.5 లక్షల వరకు పూర్తిగా పన్ను మినహాయించారు. ప్రస్తుతం రూ.2.50 లక్షల వరకు ఉంటే... ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. అంటే వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నవారు ఇక పన్ను చెల్లించాల్సిన అవసరంలేదు. దీనివల్ల 3 కోట్ల మంది వేతనజీవులు, పెన్షనర్లు లబ్దిపొందనున్నారు. మిగిలిన శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
 
అలాగే, ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. 
 
ఈ ఏడాది జనవరి వరకు జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకు చేరిందన్నారు. సినిమా టికెట్లపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించామన్నారు. ప్రస్తుతం నెలకు రూ. 97,100 కోట్లు పన్ను వసూళ్లవుతున్నాయన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాల పన్ను వసూళ్లు సాలీనా 14 శాతం మేర పెరిగాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments