Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల ఊబిలో ఏపీ.. ఎకనామిక్ అడ్వైజర్‌గా రజనీశ్‌కుమార్‌‌

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (11:53 IST)
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌ సర్కార్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ అప్పుల, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసం మరో సలహాదారుగా రజనీశ్‌ కుమార్‌‌ను నియామకం చేసింది జగన్‌ సర్కార్‌. గురు గ్రామ్‌‌కు చెందిన ఆర్థిక నిపుణుడు రజనీశ్‌కుమార్‌‌ను కేబినెట్‌ ర్యాంకుతో నియమిస్తున్నట్లు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఇక ఈ పదవిలో రెండేళ్లు పాటు కొనసాగనున్నారు రజనీశ్‌ కుమార్‌. ఆర్థిక వనరుల సమీకరణ కు ఇప్పటికే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్ర గార్గ్‌ను సలహాదారుగా నియమించింది ఏపీ ప్రభుత్వం. ఢిల్లీ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు గార్గ్. 
 
అలాగే… కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుడిగా ఆర్ పి ఠాకూర్‌ కూడా నియమించింది ఏపీ సర్కార్‌. రాష్ట్ర కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుడిగా మాజీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ ను నియమిస్తూ ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్త ర్వులు జారీ చేశారు. ఇక ఠాకూర్‌ టీడీపీ హయాంలో డీజీపీగా పనిచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments